చిన్నారులతో మైదానాలు కళకళలాడాలి | - | Sakshi
Sakshi News home page

చిన్నారులతో మైదానాలు కళకళలాడాలి

Jun 2 2025 7:36 AM | Updated on Jun 2 2025 7:36 AM

చిన్నారులతో మైదానాలు కళకళలాడాలి

చిన్నారులతో మైదానాలు కళకళలాడాలి

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): చిన్నారులతో క్రీడా మైదానాలు కళకళలాడాలని, ఆ విధంగా స్టేడియంను తీర్చిదిద్దుతామని తూర్పు శాసన సభ్యుడు మొహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ తెలిపారు. గత మూడు రోజల నుంచి స్థానిక బీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న అండర్‌–16 బాల బాలికల ఓపెన్‌ టెన్నిస్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ రూ.100 కోట్లతో స్టేడియంను అభివృద్ధి చేస్తామన్నారు. పోటీల నిర్వహకుడు, టెన్నిస్‌ కోచ్‌ షేక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ అండర్‌–16 బాలుర విజేతగా కె.విన్సెంట్‌ నిలవగా రన్నర్‌గా జయ సాయి కుమార్‌ నిలిచాడన్నారు. బాలికల్లో గోలి జోషిత విజేత కాగా తనిక్ష రెడ్డి రన్నర్‌గా నిలిచిందని చెప్పారు. విజేతలకు బహుమతులను నసీర్‌ అహ్మద్‌, టోర్నమెంట్‌ స్పాన్సర్‌ డాక్టర్‌ రామకృష్ణ, రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, జీవిఎస్‌ ప్రసాద్‌, సుబ్బారావు, జాగర్లమూడి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌

ముగిసిన అండర్‌–16 టెన్నిస్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement