
వైఎస్సార్ సీపీలో పదవుల నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురుని పలు పదవుల్లో నియమిస్తూ.. ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం జోనల్ అధ్యక్షుడిగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన కళ్లం హరికృష్ణారెడ్డిని, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన వేలూరి అనిల్రెడ్డి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి షణ్ముఖ్ (నాని)లను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
ప్రధానోపాధ్యాయులకు
ఉద్యోగోన్నతి ధ్రువపత్రాలు అందజేత
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, మున్సిపల్, నగరపాలకసంస్థ పాఠశాలల్లో ఉద్యోగోన్నతులపై నియమితులైన ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ధ్రువపత్రాలు అందజేశారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి జనరేట్ అయిన ఉద్యోగోన్నతుల ధ్రువపత్రాలను హెచ్ఎంలకు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ హెచ్ఎం ఏ.తిరుమ లేష్, హెచ్ఎంగా ఉద్యోగోన్నతి పొందిన షేక్ మొహ్మద్ ఖాసిం పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు
చెరుకుపల్లి: లారీ, బొలెరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మోరవాగుపాలెం నుంచి చందోలు వైపు లారీ వస్తోంది. అదే సమయంలో మచిలీపట్నం నుంచి నెల్లూరు వైపునకు వెళ్తున్న బొలెరో చందోలు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ సమీపంలోకి వచ్చింది. రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బొలెరోలో ఉన్న డ్రైవర్ దుర్గారావుకు తీవ్రగాయాలు అయ్యాయి. క్లీనర్ చంద్రమౌళి స్వల్పగాయాలతో బయటపడ్డారు.