తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం

May 31 2025 1:28 AM | Updated on May 31 2025 1:28 AM

తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం

తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం

● ఏసీబీ డైరెక్టర్‌ జయలక్ష్మి ● అండర్‌–16 టెన్నిస్‌ పోటీలు ప్రారంభం

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): పిల్లలు శారీరకంగా, ఽమానసికంగా ధృఢంగా ఉండాలంటే క్రీడా సాధన ఎంతో కీలకమని ఏసీబీ డైరెక్టర్‌ ఆర్‌.జయలక్ష్మి తెలిపారు. ఇది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బీఆర్‌ స్టేడియం సింథటిక్‌ కోర్టులో అండర్‌–16 ఓపెన్‌ బాలబాలికల టెన్నిస్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయలక్ష్మి మాట్లాడుతూ కొందరు తల్లిదండ్రులు చదువులకిచ్చే ప్రాధాన్యత పిల్లల ఆరోగ్యానికి ఇవ్వడం లేదన్నారు. దీంతో పిల్లల్లో అధిక శాతం ఊబకాయ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. జంక్‌ ఫుడ్‌తోపాటు మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ వీలైనంత వరకు వారికి దూరంగా ఉంచాలని సూచించారు. టెన్నిస్‌ విలువ తెలిసిన సీనియర్‌ ఆటగాడు ఎస్‌.రామకృష్ణ ఈ టోర్నమెంట్‌ను స్పాన్సర్‌ చేయడం అభినందనీయం అన్నారు. పోటీల నిర్వాహకుడు షేక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ పోటీలు మూడు రోజులపాటు జరుగుతాయన్నారు. మొత్తం 36 మంది చిన్నారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. అనంతరం పోటీలను జయలక్ష్మి,, రామకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్‌ కన్సర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బీఎన్‌ఎన్‌ మూర్తి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌ పి.శామ్యూల్‌ జొనాథన్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, ఎన్‌.సాంబశివరావు, జీవీఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement