లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి

May 29 2025 7:23 AM | Updated on May 29 2025 7:23 AM

లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి

లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి

గుంటూరు లీగల్‌: లోక్‌ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్‌చక్రవర్తి పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు జరుగనున్న లోక్‌ అదాలత్‌పై బుధవారం కోర్టు ప్రాంగణంలో కంపెనీ సభ్యులు, కౌన్సిలర్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి చర్యల గురించి వివరించారు. అందరూ సహకరించాలని సూచించారు. ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్‌.సత్యవతి, గుంటూరు ఫ్యామిలీ కోర్టు జడ్జి జి. చక్రపాణి, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్‌. శరత్‌ బాబు, ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమ, మూడో అదనపు జిల్లా జడ్జి సి.హెచ్‌.వి.ఎన్‌. శ్రీనివాసరావు, పోక్సో కోర్ట్‌ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి షమీ పర్వీన్‌ సుల్తానా బేగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సయ్యద్‌ జియావుద్దీన్‌, బార్‌ అధ్యక్షుడు వై.సూర్య నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement