
కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది దిగువ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉన్నట్లు మత్స్యకారులు బుధవారం తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్ఐ శ్రీనివాసరావు కృష్ణానది దిగువ ప్రాంతంలోని లాకుల వెంబడి ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మృతుడి ఒంటిపై నల్లని హాఫ్ నిక్కర్ మాత్రమే ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. వయస్సు 30 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే 08645272186 ఫోను నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం