
పనులు చేయకున్నా కూలి కాజేశారు!
సారంగపూర్: మండల కేంద్రంలో మంగళవారం ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధిహా మీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. జనవరి 1, 2024నుంచి మార్చి 3, 2025వరకు మండలవ్యాప్తంగా అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వ నాల్లో నాటిన మొక్కలు చనిపోయిన వి షయం, న ష్టాన్ని తనిఖీ బృందం సభ్యులు వెల్లడించారు. మ హవీర్తండాలో అధిక మస్టర్లు వేసి దాదాపు రూ.4 లక్షలు కూలీలు, మేట్ పంచుకున్నట్లు తెలిపారు. దీ నిని కూలీలు రాతపూర్వకంగా అంగీకరించగా, అధి కారులు మళ్లీ విచారణకు ఆదేశించారు. తనిఖీ బృందం సభ్యులు నిరాకరించి ఇద్దరు మేట్లను తొలగి స్తున్నట్లు ప్రకటించారు. దుర్గానగర్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగినట్లు వెల్లడించారు. మహవీర్తండాకు చెందిన ఒకే కుటుంబానికి మూడు జాబ్కార్డులు జారీ చేసి 236రోజుల పని కల్పించిన విషయమై ఇన్చార్జి డీఆర్డీవో మేట్, ఫీల్డ్ అసిస్టెంట్లను వివరణ కోరగా, గమనించలేదని బదులిచ్చారు. మహవీర్తండా, దుర్గానగర్లో తల్లిదండ్రుల పేరిట మైనర్లతో పనులు చేయించినట్లు బృందం సభ్యులు వెల్ల డించగా, మేట్పై అధికారులు ఆగ్రహం వ్యక్తంజేశా రు. ఏపీడీ నాగవర్ధన్, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఫిర్యాదుల పరిష్కార అధికారి నవీన్, ఎంపీవో అ జీజ్ఖాన్, ఏపీవో లక్ష్మారెడ్డి, ఎస్టీఎం దత్తు, ఎస్ఆర్పీలు సాంబశివాచారి, కార్యదర్శులు పాల్గొన్నారు.