డైలీవేజ్ కార్మికుల వంటావార్పు
ఏటూరునాగారం: గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో డైలీవైజ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రంలో చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరింది. మంగళవారం మండల కేంద్రంలో సమ్మె శిబిరం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ నాయకుడు దావూద్ మాట్లాడుతూ డైలీవేజ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పనిలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, భాగ్యలక్ష్మీ, జయలక్ష్మీ, సత్యం, ఊకే సమ్మక్క, విజయలక్ష్మీ, రాజు, సమ్మయ్య, సూర్యతేజ, ఇందిరా, సుమలత, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.


