నిలిచిన రేషన్‌ సంచుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

నిలిచిన రేషన్‌ సంచుల పంపిణీ

Oct 4 2025 2:18 AM | Updated on Oct 4 2025 2:18 AM

నిలిచ

నిలిచిన రేషన్‌ సంచుల పంపిణీ

నిలిచిన రేషన్‌ సంచుల పంపిణీ ● ఎన్నికల కోడ్‌ ఎఫెక్ట్‌ ● జిల్లాకు 2.36 లక్షల పర్యావరణ హిత బ్యాగులు సరఫరా

● ఎన్నికల కోడ్‌ ఎఫెక్ట్‌ ● జిల్లాకు 2.36 లక్షల పర్యావరణ హిత బ్యాగులు సరఫరా

రామాయంపేట(మెదక్‌): ఎన్నికల కోడ్‌ మూలంగా జిల్లాలోని తెల్లరేషన్‌ కార్డుదారులకు పర్యావరణ హిత సంచుల పంపిణీ నిలిచిపోయింది. జిల్లాలో ఉన్న 520 రేషన్‌ దుకాణాల్లో 2,32,579 తెల్లరేషన్‌ కార్డుదారులు ఉన్నారు. రేషన్‌ వినియోగదారులకు సరఫరా చేయడానికి గాను జిల్లాకు మొత్తం 2.36 లక్షల సంచులు సరఫరా అయ్యాయి. అక్టోబర్‌ నెల కోటాతో పాటు సంచులు వినియోగదారులకు అందజేయాలని మొదట్లో పౌర సరఫరాలశాఖ ఆదేశాలు జారీ చేసింది. సదరు సంచిపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభయహస్తం చక్రం, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిత్రాలు ముద్రించారు. ఇప్పటికే జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు, కొన్ని రేషన్‌ దుకాణాలకు సంచులు సరఫరా చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో లబ్ధిదారులకు సంచులు పంపిణీ చేయవద్దని తాజాగా పౌర సరఫరాలశాఖ ఆదేశాలు జారీ చేసింది.

కోడ్‌ ముగిసిన తర్వాతే..

ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో రేషన్‌ విని యోగదారులకు పర్యావరణ హిత సంచుల సరఫరా నిలిపివేశాం. ఈమేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కోడ్‌ ముగిసిన తరువాత లబ్ధిదారులకు అందజేస్తాం.

– జగదీశ్‌, డీఎం, పౌరసరఫరాలశాఖ

నిలిచిన రేషన్‌ సంచుల పంపిణీ1
1/1

నిలిచిన రేషన్‌ సంచుల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement