ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు కూలీల మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు కూలీల మృతి

Jun 4 2025 1:36 AM | Updated on Jun 4 2025 1:36 AM

ట్రాక

ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు కూలీల మృతి

బనగానపల్లె రూరల్‌: మండలంలోని ఎస్‌ కొత్తూరు గ్రామ సమీపంలో నాపరాయి లోడు ట్రాక్టర్‌ బోల్తాపడి కూలీలు ఎం శివారెడ్డి(49), ఎన్‌ అబ్దుల్‌రసూల్‌ (50) దుర్మరనం చెందారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పలుకూరు గ్రామానికి చెందిన శివారెడ్డి, నందవరం గ్రామానికి చెందిన ఎన్‌ అబ్దుల్‌రసూల్‌ మంగళవారం నాపరాయి లోడింగ్‌ కోసం కూలీ పనికి వెళ్లారు. పలుకూరు గ్రామం నుంచి నాపరాయిని నంద్యాలకు తరలించేందుకు ట్రాక్టర్‌ ట్రాలీపై కూర్చొని బయలుదేరారు. నందివర్గం రైల్వే వంతెన దాటిన తరువాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి ట్రాలీ బోల్తాపడింది. ప్రమాదంలో ట్రాలీపై కూర్చున శివారెడ్డి, అబ్దుల్‌రసూల్‌పై నాపరాళ్లు పడటంతో శివారెడ్డి అక్కడికక్కడే మృతిచెండాడు. తీవ్రంగా గాయపడిన అబ్దుల్‌రసూల్‌ను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షిచిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నందివర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. మృతుడు శివారెడ్డికి భార్య లక్ష్మీనారాయణమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎన్‌ అబ్దుల్‌రసూల్‌కు భార్య హుస్సేన్‌మీతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

కేసీ కాల్వలో ట్రాక్టర్‌ బోల్తా పడి..

గోస్పాడు: కేసీ కాల్వలో ట్రాక్టర్‌ బోల్తా పడి కౌలు రైతు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివ రాలు.. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి(30) గోస్పాడు మండలం సాంబవరం గ్రామ సమీపంలో ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. పొలా న్ని దుక్కి దున్నేందుకు మంగళవారం ట్రాక్టర్‌తో కేసీ కాల్వ గట్టు మీదుగా శ్రీకాంత్‌రెడ్డి బయలుదేరాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి కేసీ కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టర్‌ నడుపుతున్న శ్రీకాంత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి సోదరుడు వెంకటసుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు కూలీల మృతి 1
1/2

ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు కూలీల మృతి

ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు కూలీల మృతి 2
2/2

ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు కూలీల మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement