
బాధితులకు అండగా ఉండటం అందరి బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాధితులకు అండగా నిలవడంతోపాటు వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినిత అన్నారు. విజయవాడ హనుమాన్పేట ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని వన్స్టాప్ సెంటర్ను శుక్రవారం ఆమె సందర్శించారు. మహిళలకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. వన్స్టాప్ సెంటర్ పనితీరును సమీక్షించారు. సెంటర్లోని కౌన్సెలింగ్ గదులు, వైద్య సదుపాయాలు, తాత్కాలిక వసతి గదులను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. సెంటర్ సిబ్బంది స్వప్న, డబ్ల్యూఎస్ఐ ప్రేమలత ఇతర సిబ్బందితో సమావేశమై బాధితులకు అందుతున్న సాయం, కేసుల పరిష్కారం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు. ఈ సంధర్భంగా ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వినీత పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు, ఆమెకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు
బూసి వినిత