మినీ వ్యాన్‌ ఢీకొని ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

మినీ వ్యాన్‌ ఢీకొని ఒకరి మృతి

Sep 25 2025 12:32 PM | Updated on Sep 25 2025 1:53 PM

గన్నవరం: మండలంలోని కేసరపల్లి వద్ద చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. నేపాల్‌ నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి (35) కేసరపల్లిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఫ్లై ఓవర్‌ దాటిన తర్వాత రోడ్డు దాటుతున్న అతడిని విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న మినీ వ్యాన్‌ ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement