టీజీవోస్‌ జిల్లా అధ్యక్షుడిగా ‘కొంగర’ | - | Sakshi
Sakshi News home page

టీజీవోస్‌ జిల్లా అధ్యక్షుడిగా ‘కొంగర’

Oct 7 2025 3:35 AM | Updated on Oct 7 2025 3:35 AM

టీజీవోస్‌ జిల్లా  అధ్యక్షుడిగా ‘కొంగర’

టీజీవోస్‌ జిల్లా అధ్యక్షుడిగా ‘కొంగర’

ఖమ్మం సహకారనగర్‌: తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల(టీజీవోస్‌) అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా కొంగర వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఖమ్మంలో సోమవారం జిల్లా కార్యవర్గ సమావేశం జరగగా, జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కె.సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేయగా, ఆ స్థానంలో ఖమ్మం డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వర్లు నియామకాన్ని సభ్యులు ఆమోదించారు. అలాగే, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న మల్లెల రవీంద్రప్రసాద్‌(కారేపల్లి ఎంపీఓ)ను అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఇక జిల్లా కోశాధికారి కొండపల్లి శేషుప్రసాద్‌ను రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నందున ఆ స్థానంలో డాక్టర్‌ సూరంపల్లి రాంబాబు(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కాలేజీ) నియమితులయ్యారు. ఈమేరకు నూతన అధ్యక్షుడిని టీజీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీజీవోస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు కస్తాల సత్యనారాయణ, హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ పి.విజయ్‌కుమార్‌, నాయకులు రమేష్‌, పుష్పరాజ్‌, ఎం.సతీష్‌, అరుణకుమారి, గోపాలకృష్ణ, ఎన్‌.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement