గాంధీజీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

గాంధీజీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం

Oct 4 2025 2:10 AM | Updated on Oct 4 2025 2:10 AM

గాంధీ

గాంధీజీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం

మధిర: ఉపాధ్యాయులందరికీ టెట్‌ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన తీర్పుపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు కోరారు. మధిరలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సర్వీసులో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్‌ తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన టెట్‌ నోటిఫికేషన్లలో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులను మినహాయించినందున సీనియర్‌ ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాలన్నారు. అలాగే, ఎన్నికల విధుల నుంచి గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న వారిని మినహాయించాలని సూచించారు. నాయకులు వినోద్‌రావు, బండారు నాగరాజు, వీరయ్య, ఇబ్రహీం, లాల్‌ అహ్మద్‌, రమేష్‌, సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

మధిర: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి సేవలు చిరస్మరణీయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గాంధీజీ, శాస్త్రి జయంతి సందర్భంగా మధిరలోని క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ గాంధీజీ పాఇంచిన సత్యం, అహింస, సమానత్వం అనే విలువలు శాశ్వతమైనవని తెలిపారు. ఆయన ఆశయాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అలాగే, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి ఇచ్చిన జై జవాన్‌, జై కిసాన్‌ నినాదం రైతు, సైనికుల గౌరవాన్ని మరింతగా పెంచిందని తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌

శతాబ్ది వేడుకలు

కామేపల్లి: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ(ఆర్‌ఎస్‌ఎస్‌) శతాబ్ది ఉత్సవాలు శుక్రవారం రాత్రి కామేపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వయం సేవకులు ప్రత్యేక దుస్తుల్లో పద సంచలన్‌ చేశారు. అనంతరం సాయిబాబా ఆలయ ఆవరణలో జరిగిన సమావేశంలో జిల్లా సంఘ్‌ చాలక్‌ లక్కినేని ప్రసాద్‌ మాట్లాడారు. వ్యక్తి నిర్మాణమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యమని తెలిపారు. స్వయం సేవకులు దేశాభివృద్ధి, సామాజిక శ్రేయస్సుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూరి శివరామకృష్ణ, మోహన్‌నాయక్‌, పోలూరి రామచంద్రయ్య, భద్రయ్య, దయానంద్‌, వెంకటాచారి, పూజల శివకృష్ణ, హన్మంతరావు, జర్పుల రామారావు, భూక్యా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

టెట్‌ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌ చేయాలి

మాజీ మంత్రి

దామోదర్‌రెడ్డికి నివాళి

ఖమ్మంమయూరిసెంటర్‌/కామేపల్లి: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇటీవల మృతి చెందగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో మృతదేహం వద్ద మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శుక్రవారం నివాళులర్పించి దామోదర్‌రెడ్డి కుటుంబీకులను పరామర్శించారు. అలాగే, కామేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దామోదర్‌రెడ్డి చిత్రపటం వద్ద కాంగ్రెస్‌ నాయకులు నివాళులర్పించారు.

గాంధీజీ, శాస్త్రి సేవలు  చిరస్మరణీయం 
1
1/3

గాంధీజీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం

గాంధీజీ, శాస్త్రి సేవలు  చిరస్మరణీయం 
2
2/3

గాంధీజీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం

గాంధీజీ, శాస్త్రి సేవలు  చిరస్మరణీయం 
3
3/3

గాంధీజీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement