
మూడు నెలల రేషన్.. ఇదేం పరేషాన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలల రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నాయి. కార్డుదారుల రాకతో రేషన్ దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఒక రేషన్కార్డుపై బియ్యం పంపిణీ చేసేందుకు మూడుసార్లు ఈ పాస్ యంత్రంపై వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటోంది. ఇందుకోసం సుమారు అర్ధగంట వరకు సమయం పడుతోంది. దీంతో కార్డుదారులు చెప్పులు, సంచులను వరుస క్రమంలో పెడుతున్నారు. కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్, గణేశ్నగర్, వావిలాలపల్లి తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నగరంలోని ఓ రేషన్ దుకాణం ఎదుట సంచులు, బుట్టలు, చెప్పులు వరుసక్రమంలో పెట్టగా సాక్షి కెమెరాకు ఇలా చిక్కింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్