మేలుకో.. రిజిస్ట్రేషన్‌ చేసుకో! | - | Sakshi
Sakshi News home page

మేలుకో.. రిజిస్ట్రేషన్‌ చేసుకో!

Feb 25 2026 9:39 AM | Updated on Feb 25 2026 9:39 AM

మేలుక

మేలుకో.. రిజిస్ట్రేషన్‌ చేసుకో!

నాలుగు రోజులే గడువు.. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కీలకం.. ● జనవరి నెలాఖరు వరకు 96.94 శాతంతో 63,298 హెక్టార్లలో సాగైనట్లు చెప్పిన అధికారులు ఫిబ్రవరి నెలలో ఏకంగా 22,717 హెక్టార్లు పెరిగినట్లు చూపించడం విశేషం. ● ఉన్నఫలంగా అంత విస్తీర్ణంలో పంటలు ఎలా పెరిగాయో స్పష్టత ఇవ్వడం లేదు. ● మొత్తంగా చూస్తే రబీలో ప్రధాన పంటలైన పప్పు శనగ సాధారణ విస్తీర్ణం 8,121 హెక్టార్లకు గానూ 219 శాతంతో 17,850 హెక్టార్లలో సాగుచేశారు. ● మొక్కజొన్న 20,334 హెక్టార్లకు గానూ 144 శాతంతో 29,298 హెక్టార్లలో, జొన్న 16,893 హెక్టార్లకు గానూ 102 శాతంతో 17,328 హెక్టార్లలో, పెసర 10,759 హెక్టార్లకు గానూ 113 శాతంతో 12,147 హెక్టార్లలో, మినుము 6,529 హెక్టార్లకు గానూ 115 శాతంతో 7,515 హెక్టార్లలో సాగు చేశారు. ● అంచనాలకు మించి సాగు చేసినట్లు నివేదిక చెబుతోంది. ● అలాగే వరి సాధారణ విస్తీర్ణం 868 హెక్టార్లకు గానూ 966 హెక్టార్లు, కంది 94 హెక్టార్లకు గానూ 246 హెక్టార్లు, పొగాకు 1,615 హెక్టార్లకు గానూ 613 హెక్టార్లు, వేరు శనగ 3 హెక్టార్లకు గానూ 25 హెక్టార్లు, నువ్వులు 39 హెక్టార్లకు గానూ 20 హెక్టార్లలో పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ● ఈ–పంట(డిజిటల్‌ క్రాప్‌ సర్వే) పూర్తయితే పంటల వారీగా ఖచ్చితమైన గణాంకాలు వెల్లడికానున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, బీమా వంటి సేవలు వివిధ జాబితాల ఆధారంగా అమలయ్యాయి.

రాబోయే రోజుల్లో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న రైతులకే అన్ని రైతు సేవలు అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే ఆధార్‌ తరహాలో 11 అంకెల విశిష్ట సంఖ్యను అందజేయనున్నారు. నమోదు లేకపోతే పథకాల లబ్ధి పొందే అవకాశం ఉండదని చెబుతున్నారు.

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా రైతుల భూ వివరాలు, పంటల సమాచారం, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు ఒకే డేటాబేస్‌లో నమోదవుతాయి. దీనివల్ల నిజమైన రైతులకు మాత్రమే లబ్ధి, నకిలీ లబ్ధిదారులకు అడ్డుకట్ట, పథకాల అమలులో పారదర్శకత సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,37,143 మందికి రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,16,950 మందికి నమోదు పూర్తి చేశారు. ఇంకా 20,193 మందికి పూర్తి చేయాల్సి ఉంది.

డోర్‌లాక్‌, డెత్‌ కేసులతో ఈ నమోదు పక్రియ తడబాటు ఎదురవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ–పంట నమోదు, అదనపు సర్వేలు సైతం వేధిస్తున్నాయని వాపోతున్నారు.

చాలా మంది రైతులు సొంతూళ్లు వదిలి వ్యాపారం, పిల్లల సంరక్షణ, చదువుల కోసం పట్టణాలు, నగరాలకు వెళ్లిపోయారు. వారంతా స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు.

మరణించిన భూ యజమానుల వారసులు భూములను తమ పేరిట మార్చుకోకపోవడం, ఆధార్‌తో ఫోన్‌ నంబర్‌ అనుసంధానం చేయించుకోకపోవడం తదితర సమస్యలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

ఇంకో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండటంతో.. సిబ్బంది హడావుడి చేస్తున్నారు. రైతులకు ఫోన్‌ చేసి రైతు సేవా కేంద్రాలకు రావాలని.. లేకుంటే ఆధార్‌, ఓటీపీలు చెబితే నమోదు చేస్తామని చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో పంటల బీమా, నష్ట పరిహారం, ఇన్‌ఫుట్‌ సబ్సిడీలు, రైతు సేవా కేంద్రాల సేవలు వంటి అన్ని అంశాలు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ఆధారంగానే అమలు చేయనున్నారు. ఇప్పుడు నమోదు చేసుకోకపోతే భవిష్యత్‌లో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ రైతుల భవిష్యత్తుకు కీలకం. ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.

–ఎం.పద్మావతి, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు

కొరిటెపాడు(గుంటూరు): అక్టోబర్‌ మాసంలో మొదలైన రబీ సీజన్‌ ఫిబ్రవరి ఆఖరుకు దాదాపుగా ముగిసింది. ఈ సారి 65,295 హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా, చివరకు 131.73 శాతంతో 86,015 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేసినట్టు వ్యవసాయ శాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది.

కొరిటెపాడు(గుంటూరు): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ గడువు ఈ నెల చివరి నాటికి ముగియనుంది. జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం 1,37,143 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 1,16,950 మంది రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం జరిగింది. మిగిలిన 20,193 మంది తక్షణమే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తద్వారా జరిగే ఉపయోగాలను వెల్లడిస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి..

ఇంకా 20,193 మంది..

అందుబాటులో లేక..

మేలుకో.. రిజిస్ట్రేషన్‌ చేసుకో! 1
1/1

మేలుకో.. రిజిస్ట్రేషన్‌ చేసుకో!

Advertisement
 
Advertisement
Advertisement