కాటూరిలో గుండె ఆపరేషన్‌లకు రంగం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

కాటూరిలో గుండె ఆపరేషన్‌లకు రంగం సిద్ధం

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

కాటూరిలో గుండె ఆపరేషన్‌లకు రంగం సిద్ధం

కాటూరిలో గుండె ఆపరేషన్‌లకు రంగం సిద్ధం

● ఈనెల 25న కాటూరి మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో 22వ కన్వోకేషన్‌, గ్రాడ్యుయేషన్‌ డే–2026 వేడుకలకు గవర్నర్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్టు డాక్టర్‌ ఏకుల కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. గౌరవ అతిథిగా డాక్టర్‌ చంద్రశేఖర్‌ సంకురాత్రి హాజరవుతారన్నారు. ● కాటూరి మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ చైర్మన్‌ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్‌ డాక్టర్‌ స్వైరరావు నేతృత్వంలో అత్యాధునిక వైద్య సేవలు పేద ప్రజలకు నామమాత్రపు ఫీజులతో, మరికొన్ని రకాల వైద్య సేవలు ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా పూర్తి ఉచితంగా అందజేస్తున్నామన్నారు. గ్రామాల్లో సైతం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కాలేజీ డీన్‌ డాక్టర్‌ చల్లా మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు మెడికల్‌: ఏపీలోనే తొలిసారిగా గుండె చికిత్సలు చేసే అడ్వాన్స్‌డ్‌ ఇంటర్వెన్షనల్‌ సీమెన్స్‌ క్యాథ్‌ల్యాబ్‌ (గుండె వ్యాధుల చికిత్స)ను రూ. 6 కోట్లతో ఏర్పాటు చేసినట్టు కాటూరి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏకుల కిరణ్‌కుమార్‌ చెప్పారు. ఈనెల 25న రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి గుండె శస్త్రచికిత్స ఆపరేషన్‌ థియేటర్‌ ప్రారంభిస్తారని చెప్పారు. గుంటూరులోని కాటూరి అర్బన్‌ క్లీనిక్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాథ్‌ ల్యాబ్‌ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉందన్నారు. ఈ విధమైన ల్యాబ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌లో తమ వద్ద మాత్రమే ఉందన్నారు.

రేపు గవర్నర్‌ చేతుల మీదుగా ఆధునిక క్యాథ్‌లాబ్‌ ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement