
వివాహేతర సంబంధమే కారణం
చేబ్రోలు: వివాహేతర సంబంధం నేపధ్యంలో వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన సోమవారం సుద్ధపల్లిలో చోటు చేసుకుంది. చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరి గోపయ్య(35)ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హతమార్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చేబ్రోలు సీఐ వై.కోటేశ్వరరావు, ఎస్ఐ డి.వెంకటకృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
మృతుడి తల్లి కొమ్మూరి రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి.వెంకటకృష్ణ తెలిపారు. మహిళకు ఇద్దరు వ్యక్తులతో ఉన్న వివాహేతర సంబంధం నేపధ్యంలో ఇరువురి మద్య చోటు చేసుకున్న వివాదం కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.