లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్లో 70వ రైల్వే వీక్ అవార్డులు 14 మందికి రావడం అభినందనీయం అని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ కార్యాలయంలో బుధవారం 70వ రైల్వే వీక్ అవార్డులను డీఆర్ఎం ప్రదానం చేశారు. ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలలో అవార్డులు అందుకున్న వారి కృషి, నిబద్ధతను ప్రశంసించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, సంబంధిత డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


