పదో తరగతి ఫలితాల్లో మళ్లీ పైచేయి
90.86 శాతంతో జిల్లాకు 11వ స్థానం
సాక్షి, విశాఖపట్నం : పదో తరగతి పరీక్షల్లో బాలురు సత్తా చాటారు. జిల్లాలో పైచేయి సాధించారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండున్నర నెలలకు పైగా తరగతులు జరగలేదు. కానీ గత డీఈవో బి.లింగేశ్వరరెడ్డి ప్రణాళిక ఫలితంగా 90.86 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లాకు 11వ స్థానం దక్కింది. 2009-10లో 16వ స్థానంలో ఉన్న జిల్లా ఒక్కో మెట్టూ అధిగమిస్తూ.. గతేడాది 13వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ఏకంగా రెండు మెట్లు అధిగమించడం గమనార్హం.
మళ్లీ బాలురదే పైచేయి!
ఈ ఏడాది జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 62,265 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో ప్రయివేటు విద్యార్థులు 11,369 మంది ఉన్నారు. రెగ్యులర్ కేటగిరీలో 50,896 మందికిగాను పరీక్షలకు గైర్హాజరైనవారు, మాల్ప్రాక్టీస్కు పాల్పడి డిబారైనవారిని తీసివేయగా 50,685 మంది ఫలితాల కోసం నిరీక్షించారు. వీరిలో 90.86 శాతంతో 46,053 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 26,126 మందిలో 91.04 శాతంతో 23,784 మంది, బాలికలు 24,559 మందిలో 90.68 శాతంతో 22,269 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో కొన్నేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో బాలుర హవా నడుస్తోంది. ప్రయివేటు కేటగిరీలో 11,369 మందికిగాను సుమారు 65 శాతంతో దాదాపు 7,500 మంది ఉత్తీర్ణులైనట్టు సమాచారం. అధికారిక సమాచారం ఇంకా విద్యాశాఖకు రావాల్సి ఉంది.
49 స్కూళ్లలో శతశాతం ఉత్తీర్ణత
జిల్లాలోని 49 ప్రభుత్వ పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో యలమంచిలి, పాడేరు డివిజన్లో సుమారు 30 పాఠశాలలున్నాయి. మిగిలినవి అర్బన్ డివిజన్లో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు కేటగిరీలో 10,656 మంది ఆంగ్లమాధ్యమంలో పరీక్షలు రాశారు. 94 శాతంతో సుమారు 10 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ప్రభుత్వ కే టగిరీలోని సక్సెస్ స్కూళ్లలో చదువుతున్నవారే సుమారు 5 వేల మంది విద్యార్థులున్నట్టు సమాచారం. గతేడాది పదికి పది గ్రేడ్ పాయింట్ల సగటు(జీపీఏ) సాధించిన
విద్యార్థులు 37 మంది.
ఈ సారి మాత్రం ఈ సంఖ్య ఏకంగా 147కు చేరింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ.. 10 జీపీఏ సాధించిన వారు మాత్రం తక్కువే. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది 9.8 జీపీఏ సాధించినవారున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రయివేటు/కార్పొరేట్ పాఠశాలల్ని మినహాయిస్తే.. నగరంలోని శాక్రడ్ హార్ట్స్ ఎయిడెడ్ హైస్కూల్, చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్, అనకాపల్లిలోని సీతానగరం జెడ్పీ హైస్కూల్లో ఒక్కో విద్యార్థి 10కి 10 జీపీఏ సాధించారు.
బాలురే టాప్
Published Fri, May 16 2014 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement