
వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల ఘన నివాళి
వేంపల్లె : వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వైఎస్సార్ సమాధి వద్ద పీసీసీ చీఫ్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. గురువారం పులివెందుల పర్యటనకు విచ్చేసిన ఆమె వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి విచ్చేశారు. వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కాంగ్రెస్ నాయకులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం పని చేయాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి, ప్రొద్దుటూరు కాంగ్రెస్ సమన్వయ కర్త ఇర్ఫాన్ బాషా, పులివెందుల సమన్వయ కర్త ధృవకుమార్ రెడ్డి, వేంపల్లె మండల అధ్యక్షుడు రామకృష్ణ, రామాంజనేయరెడ్డి, బాలం సుబ్బరాయుడులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.