
మున్సిపాల్టీలో పన్నులు వసూలు చేయండి
కడప ఎడ్యుకేషన్ : మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో మున్సిపల్ అధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. సమీక్షా సమావేశం ఆయన మాట్లాడుతూ ఆస్తి పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వార్డుకు క్లస్టర్ స్థాయి పన్నుల జాబితా రూపొందించాలన్నారు. వాటర్ టాక్స్, అడ్వర్టైజ్మెంట్, ట్రేడ్ లైసెన్స్, షాప్ రెంట్లు, బిల్డింగ్ ఛార్జీల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. బద్వేల్, కమలాపురం అండర్ అసెస్మెంట్లపై సర్వే చేయించాలన్నారు. టౌన్ ప్లానింగ్లో ఆన్లైన్ విధానాన్ని రెండు నెలల్లో అమలు చేస్తామన్నారు. కడప నగరంలో 387 షార్ట్ ఫాల్స్ సమస్యలపై టౌన్ ప్లానింగ్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో రూ.125 కోట్లతో నూతన స్లీపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అతిథిసింగ్, పబ్లిక్ అండ్ హెల్త్ సూపరింటెండెంట్ రామ్మోహన్రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీ విశ్వనాథ్, టౌన్ ప్లానింగ్ రిజినల్ డిప్యూటీ డైరెక్టర్ సంజీవ్ కుమార్, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్, రాకేష్ చంద్ర, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ