
మహానాడుకు భారీ బందోబస్తు
కడప అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27, 28, 29వ తేదీలలో జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బందోబస్తు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్, అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, సీఐడీ ఎస్పీ శ్రీధర్, నార్కోటిక్స్ ఎస్పీ పి.నగేష్ పేర్కొన్నారు. సీఎంతో పాటుపలువురు వీఐపీలు, మంత్రులు మహానాడులో పాల్గొనే నేపథ్యంలో సికె దిన్నె పరిధిలోని మహానాడు వేదిక, జయరాజ్ గార్డెనన్ హాల్, మాధవీ కన్వెన్షన్ హాల్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో వారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు ప్రణాళికను వివరిస్తూ సెక్టార్ల వారీగా విధులు నిర్వర్తించాలన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్పరంగా అవాంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రూట్ బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్, క్లియరెన్స్ సెక్టార్ల అధికారులకు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ఎస్పీ వివరించారు. అనంతరం పబ్బాపురం వేదిక వరకూ కాన్వాయ్ వచ్చే మార్గంలో చేపట్టాల్సిన భద్రతాచర్యలపై కాన్వాయ్ రిహార్సల్స్లో ఎస్పీ పాల్గొ పాల్గొని దిశానిర్దేశం చేశారు.
జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్