● మహానాడుకు డుమ్మా కొట్టే యోచన | - | Sakshi
Sakshi News home page

● మహానాడుకు డుమ్మా కొట్టే యోచన

May 26 2025 12:30 AM | Updated on May 26 2025 12:30 AM

● మహా

● మహానాడుకు డుమ్మా కొట్టే యోచన

కాపు నేతల్ని విస్మరిస్తున్న తెలుగుదేశం పార్టీ

ఎమ్మెల్సీ సీఆర్సీ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల, సుగవాసి బ్రదర్స్‌కు అప్రాధాన్యత

మినీ మహానాడు కార్యక్రమానికి దూరంగా ఆ ముగ్గురు

ఎన్నికల్లో ముందు పెట్టుకొని, ఆపై పక్కన పెట్టిన స్థానిక నేతలు

రాష్ట్ర మహానాడుకు దూరంగా ఉండిపోవాలని నిర్ణయం!

సాక్షి ప్రతినిధి, కడప: ‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్లుగా అధినేత చంద్రబాబు స్ఫూర్తితో.. స్థానిక టీడీపీ నేతలు యూజ్‌ అండ్‌ త్రో పాలసీ అందిపుచ్చుకున్నారు. ఎన్నికల్లో వాడుకుని ఆపై ఏమీ పట్టనట్లు వదిలేశారు. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో కాపు(బలిజ) సామాజిక వర్గ నేతల్ని క్రమేపీ దూరం చేశారు. ‘ఆలోచనలు, వ్యూహం, ఎత్తుగడలు మీవే, ఆచరణలో మాత్రమే మేముంటామ’ని చెప్పుకొచ్చి ఎన్నికల్లో వాడుకున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత విస్మరించారు. అలాంటి బాధితుల్లో ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యం, ప్రసాద్‌బాబు ప్రధానంగా నిలుస్తున్నారని విశ్లేకులు భావిస్తున్నారు.

భవిష్యత్తులో అడ్డుగా నిలుస్తారనే..

తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. భవిష్యత్తులో అడ్డుగా నిలుస్తారనే అభద్రతా భావంతో.. ఎన్నికల్లో వాడుకున్న అనేక మందిని తర్వాత వదిలేశారు. మేధస్సు, సామాజిక బలంతో ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. సీనియన్‌ నేత అయినందు వల్ల.. ఎన్నికల్లో ఆయన బలాన్ని బాగా వాడుకున్నారు. తర్వాత విస్మరిస్తూ వచ్చారు. జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో ఎందులోనూ ఆయనకు ప్రాధాన్యత లభించలేదు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి పూర్తిగా విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉనికి కోసం అన్నట్లుగా రామచంద్రయ్య చర్యలు ఉండిపోయాయి. ఇంటి వద్దనే ప్రజాదర్బార్‌ లాంటి కార్యక్రమాలు చేపడుతూ.. తాను కూడా ఉన్నానని హెచ్చరికలు పంపే చర్యలకు పాల్పడినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

సుగవాసి కుటుంబానిదీ అదే పరిస్థితి..

రాయచోటి పాలకొండ రాయుడు పేరు తెలియని రాజకీయ నేత.. రాష్ట్రంలోనే ఉండరంటే అతిశయోక్తి కాదు. మునుపటి కాలంలో రాయచోటి ఎన్నికలంటే ప్రత్యక్ష యుద్ధం తెరపైకి వచ్చేది. 1978, 83, 99, 2004లలో ఆయన రాయచోటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984–89 కాలంలో రాజంపేట ఎంపీగా గెలుపొందారు. మండిపల్లి, సుగవాసి కుటుంబాల మధ్య ప్రత్యక్ష యుద్ధం నడిచేది. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అభ్యర్థిగా ఎంపిక చేసినా.. సుగవాసి పాలకొండరాయుడు కుటుంబం తెలుగుదేశం పార్టీ ఉన్నతికి పని చేసింది. ఎన్నికల తర్వాత సుగవాసి బాలసుబ్రమణ్యం, ప్రసాద్‌బాబులను ఆ పార్టీ దూరంగా పెట్టింది. రాజంపేట అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచిన సుగవాసి బాలసుబ్రమణ్యానికి కనీసం ఇన్‌చార్జి పదవి కూడా అప్పగించలేదు. మరోవైపు పాలకొండరాయుడు మృతి చెందితే.. సీఎం చంద్రబాబు స్వయంగా పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. ఇవన్నీ పరిశీలిస్తే కాపులను జిల్లాలో వ్యూహాత్మకంగా దూరంగా పెడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బత్యాల.. ఎక్కడ?

రైల్వేకోడూరులో అన్నీ తానై నడిపించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడు ఇటీవల కాలంలో రాజకీయంగా కనుమరుగయ్యారు. రైల్వేకోడూరు, రాజంపేట సెగ్మెంట్లల్లో కాపు సామాజిక వర్గాన్ని అనువుగా మల్చుకునేందుకు ఎన్నికల ముందు ఆయనకు ప్రాధాన్యత లభించింది. తర్వాత రాజకీయంగా దెబ్బకొట్టే చర్యలకు టీడీపీ పాల్పడుతోంది. గతంలో విశ్వనాథనాయుడుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి దెబ్బ కొట్టగా, తాజాగా ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదు. కనీసం రైల్వేకోడూరులోనూ పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన వర్గీయులు వాపోతున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్సీ రామచంద్రయ్య, బత్యాల చెంగల్‌రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యం మినీ మహానాడు కార్యక్రమానికి హాజరు కాలేదు. అందుబాటులో ఉండి కూడా.. టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో చొరవ లేకపోవడంతో హాజరు కాలేదని తెలుస్తోంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయిలో కడప గడపలో నిర్వహిస్తున్న మహానాడుకు కూడా హాజరు కాకుండా దూరంగా ఉండిపోవాలని ఆయా నేతల అనుచరులు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ఆ మగ్గురు మహానాడు డుమ్మా కొట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

● మహానాడుకు డుమ్మా కొట్టే యోచన1
1/3

● మహానాడుకు డుమ్మా కొట్టే యోచన

● మహానాడుకు డుమ్మా కొట్టే యోచన2
2/3

● మహానాడుకు డుమ్మా కొట్టే యోచన

● మహానాడుకు డుమ్మా కొట్టే యోచన3
3/3

● మహానాడుకు డుమ్మా కొట్టే యోచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement