భవిష్యత్తుకు విద్య పునాది లాంటిది | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్తుకు విద్య పునాది లాంటిది

May 25 2025 7:25 AM | Updated on May 25 2025 7:25 AM

భవిష్యత్తుకు విద్య పునాది లాంటిది

భవిష్యత్తుకు విద్య పునాది లాంటిది

వేంపల్లె : విద్య అనేది భవిష్యత్తుకు పునాది లాంటిదని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నా రు. శనివారం స్థానిక మధురెడ్డి కల్యాణ మండపంలో సంసిద్ద్‌ సతీష్‌ రెడ్డి పాఠశాలలో టాటా క్లాస్‌ ఎడ్జ్‌ ఇంఫ్రింట్స్‌ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన నూతన కోర్సుల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కడప ఎంపీ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి నూతన కోర్సులను ప్రారభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు నచ్చిన విధంగా ప్రోత్సహిస్తే గొప్పవారవుతారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా విద్యను అందించాలనే ఉద్దేశంతో పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో సంసిద్ద్‌ సతీష్‌ రెడ్డి పేరుతో పాఠశాలను నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు మంచి నాణ్యత గల విద్యనందించేందుకు పాఠశాల సిబ్బంది కృషి చేయాలని సంసిద్ద్‌ సతీష్‌ రెడ్డి పాఠశాల ఫౌండర్‌ సతీష్‌ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సంసిద్ద్‌ పాఠశాల గ్రూపు చైర్మన్‌ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ రవికుమార్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌ రెడ్డి, సర్పంచ్‌ రాచినేని శ్రీనివాసులు, సంసిద్ద్‌ పాఠశాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ అంజద్‌బాషా, తుషార్‌ నాగిరెడ్డి, రోహన్‌ నాగిరెడ్డి, ప్రిన్సిపల్‌ పరిమళ, చైతన్యలతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement