మద్యం మత్తులో దాడి | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో దాడి

May 25 2025 7:25 AM | Updated on May 30 2025 2:53 PM

రైల్వేకోడూరు అర్బన్‌ : మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతీవద్ద ఉన్న మద్యం దుకాణం వద్ద మద్యం తాగే సమయంలో అరవింద్‌, రవితేజ అనే యువకుల మధ్య శనివారం మాటామాటా పెరిగింది. మద్యం మత్తులో ఉన్న రవితేజ అరవింద్‌పై బాటిల్‌ పగులగొట్టి దాడి చేశాడు. ఈ దాడిలో అరవింద్‌కు గొంతు వద్ద తీవ్ర గాయమైంది. దీంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

టైలరింగ్‌, బ్యూటీ థెరపీపై శిక్షణ

తంబళ్లపల్లె : స్థానిక టీఎన్‌.వెంకటసుబ్బారెడ్డి మెమోరియల్‌ ప్రభుత్వ ఐటీఐలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్‌ హబ్‌ సెంటర్‌ ద్వారా మహిళలకు టైలరింగ్‌, బ్యూటీ థెరపీపై శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్‌ శ్రీనివాసులురెడ్డి, కో ఆర్డినేటర్‌ చౌడయ్య తెలిపారు. మూడు నెలల పాటు ఈ శిక్షణ ఇస్తారని, 15 సంవత్సరాలకు పైబడి 45 ఏళ్ల వయస్సు లోపు ఉన్న మహిళలు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు ఈ నెల 29వ తేదీ లోపు ఐటీఐ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ నంబర్‌ 9618655759లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement