దొడ్డిదారిలో.. దొడ్డుబియ్యం | - | Sakshi
Sakshi News home page

దొడ్డిదారిలో.. దొడ్డుబియ్యం

Jun 4 2025 2:22 AM | Updated on Jun 4 2025 2:22 AM

దొడ్డిదారిలో.. దొడ్డుబియ్యం

దొడ్డిదారిలో.. దొడ్డుబియ్యం

ఆలేరులో రూ.10 లక్షల విలువైన బియ్యం మాయం

దొడ్డుబియ్యం నిల్వలు

1,632 మెట్రిక్‌ టన్నులు

అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, బఫర్‌ గోదాములు, రేషన్‌ దుకాణాల్లో మొత్తం 1,632 మెట్రిక్‌ టన్నుల దొడ్డుబియ్యం నిల్వలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం పంపిణీతో దొడ్డు బియ్యానికి డిమాండ్‌ పెరిగింది. ప్రధానంగా హోటళ్లలో దోశలు పోయడానికి గతంలో రేషన్‌ బియ్యాన్ని వాడే వారు. ఇదే క్రమంలో అవే బియ్యం అక్కడక్కడ లభిస్తుండడంతో వ్యాపారులు చాటుమాటుగా కొనుగోలు చేస్తున్నారు.

ఆలేరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో దొడ్డుబియ్యం అమ్ముకున్న విషయం ఇటీవల బయటపడింది. రూ.10 లక్షల విలువ చేసే బియ్యాన్ని సదరు గోదాము ఇన్‌చార్జ్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ వేర్వేరుగా ఎవరికి వారే బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి అమ్ముకున్నారు. అయితే గోదాము ఇన్‌చార్జ్‌ ఇటీవల బదిలీ అయితే ఆయన స్థానంలో మరో అధికారికి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా వచ్చిన అధికారి బియ్యం నిల్వల్లో తేడాను గుర్తించి డీఎంకు తెలిపారు. దీంతో అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే అక్రమాలకు పాల్పడిన అధికారి బదిలీ కావడం, ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో దొడ్డుబియ్యం జాడ దొరకలేదు. దీంతో దొడ్డు బియ్యాన్ని అమ్ముకున్నట్టు తేలింది. ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారుల విచారణలో వెలుగు చూసిన వాస్తవం

పలు చోట్ల పక్కదారి పడుతున్న దొడ్డుబియ్యం

రేషన్‌ దుకాణాల్లో భారీగా నిల్వలు

సన్నబియ్యం నిల్వకు స్థలంలేక ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement