సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

Jun 4 2025 2:22 AM | Updated on Jun 4 2025 2:22 AM

సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

సాక్షి, యాదాద్రి : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ఈ నెల 6న సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్న సందర్భంగా అధికారులు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంగళవారం భవనగిరి కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్‌ హాల్‌లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలీస్‌ బందోబస్తు పకడ్బందీగా ఉండాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, సేవలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని అగ్నిమాపక, ఆరోగ్య శాఖలకు సూచించారు. అలాగే వివిధ శాఖలు చేయాలని పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, కలెక్టరేట్‌ ఏఓ జగన్మోహన్‌ ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ హనుమంతరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement