
ప్రత్యేక దృష్టితోనే మెరుగైన ఫలితాలు
జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకులాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. దీంతో పదో తరగతిలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. డీఈఓ జ్ఞానేశ్వర్ పర్యవేక్షణలో విద్యార్థులకు ఉదయం ఒక గంట, సాయంత్రం మరోగంట పాటు అదనంగా సబ్జెక్టు టీచర్లు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థులపై కూడా దృష్టి సారించాం. కలెక్టర్ సత్యశారద విద్యార్థులకు స్ఫూర్తి కార్యక్రమం కూడా నిర్వహిచారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయాందోళన లేకుండా పరీక్షలు రాసేందుకు స్ఫూర్తి కార్యక్రమం దోహదం చేసింది.
కె.అరుణ, డీఈఓ కార్యాలయ ఏసీజీఈ