జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 81 వినతులు | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 81 వినతులు

Oct 7 2025 3:22 AM | Updated on Oct 7 2025 3:22 AM

జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 81 వినతులు

జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 81 వినతులు

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 81 వినతులు వచ్చాయి. అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్‌ వర్మలు ఫిర్యాదులు స్వీకరించారు. అందిన 81 వినతుల్లో జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగానికి 4, రెవెన్యూ విభాగానికి 6, ప్రజారోగ్య విభాగానికి 5 ఫిర్యాదులు రాగా, పట్టణ ప్రణాళిక విభాగానికి అత్యధికంగా 46, ఇంజినీరింగ్‌ సెక్షన్‌కు 12, మొక్కల విభాగానికి 2, యూసీడీకి 6 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్‌, ఫైనాన్సర్‌ అడ్వైజర్‌ మల్లికాంబ, ప్రధాన సిటీ ప్లానర్‌ ప్రభాకరరావు, డీసీఆర్‌ శ్రీనివాసరావు, పర్యవేక్షక ఇంజినీర్లు కె.శ్రీనివాసరావు, సంపత్‌కుమార్‌, గోవిందరావు, డీడీహెచ్‌ దామోదరరావు, డీసీపీలు హరిదాసు, కె.వెంకటేశ్వరారవు, రామ్మోహన్‌, మదుసూధనరావు, యూసీడీ పీఓ ప్రసన్నవాణి పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement