దసరా మామూళ్లు ఇవ్వలేదని దాడి | - | Sakshi
Sakshi News home page

దసరా మామూళ్లు ఇవ్వలేదని దాడి

Oct 4 2025 6:24 AM | Updated on Oct 4 2025 6:24 AM

దసరా మామూళ్లు ఇవ్వలేదని దాడి

దసరా మామూళ్లు ఇవ్వలేదని దాడి

మద్దిలపాలెం: విశాఖలోని రాంనగర్‌లో దసరా మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో హోటల్‌ నిర్వాహకులపై దాడి జరిగింది. త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న చిట్టినాయుడు కోడి పలావ్‌ దుకాణాన్ని నడుపుతున్న అబ్బిరెడ్డి నరేంద్ర, అతని సోదరుడు మణికంఠపై ఈ దాడి జరిగింది. గురువారం ధనకోటి సురేష్‌, మడ్డు హరి, చంద్రాల మహేంద్రతో పాటు మరికొంతమంది వచ్చి దసరా మామూళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిని ప్రశ్నించినందుకు, నిందితులు తీన్‌మార్‌ కర్రలతో నరేంద్ర, మణికంఠపై దాడికి దిగారు. ఈ దాడిలో నిర్వాహకుల్లో ఒకరికి కుడి కంటికి తీవ్ర గాయం అయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ సీఐ పల్లా పైడియ్య ఆదేశాలతో ఎస్‌ఐ షేక్‌ షరీఫ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చిట్టినాయుడు కోడి పలావ్‌

నిర్వాహకులకు తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement