
విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు
విశాఖ సిటీ: విశాఖను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ పేర్కొన్నారు. విశాఖలో వన్యప్రాణుల అభయారణ్యం అభివృద్ధిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన సింగపూర్కు చెందిన మాండై వైల్డ్ లైఫ్ ప్రతినిధులతో మంగళవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించే విధంగా కై లాసగిరిపై జిప్లైనర్, స్కై సైక్కింగ్ను ఏర్పాటు చేసి నట్లు చెప్పారు. త్వరలోనే గ్లాస్ బ్రిడ్జ్ కూడా అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. రోప్వేను మరింత ఆధునికీకరణ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జూ పార్క్ క్యూరేటర్ మంగమ్మ జూ అభివృద్ధిపై వివరించారు. పార్కును మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ శ్రీభరత్, చైర్మన్ ప్రణవ్గోపాల్ సూచించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, మాండై వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ మైక్ బార్క్లే, ఉపాధ్యక్షుడు మార్క్ క్రెమెడ్స్ పాల్గొన్నారు.