
అనుమతి కోసం పోలీసులకు లేఖ
విశాఖ సిటీ: వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి అనుమతి కోరుతూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏడీసీపీ అడ్మిన్కు లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్త మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీవాత్సవ్, జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గ, జిల్లా అనుబంధం విభాగ అధ్యక్షులు పేడాడ రమణికుమారి, బోని శివరామకృష్ణ, దేవరకొండ మార్కండేయులు, వడ్డాది దిలీప్, పార్టీ నాయుకులు నీలి రవి, ఎస్.కె.బాబ్జి, కొట్యాడ సూర్య, పీతల గోవింద్, జానకిరామ్, విశాలాక్షి, అప్పన, తదితరులు పాల్గొన్నారు.