ఆధునిక ప్రమాణాలతో..
అయితే డిజిటల్ చెల్లింపుల అమలులో కొన్ని సాంకేతిక సమస్యలు, దుర్వినియోగం జరిగే అవకాశం వంటి అంశాలపై దేవస్థానం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి సహేతుకమైనవే అయినప్పటికీ.. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన ఆధునిక సాఫ్ట్వేర్ను వినియోగించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. భక్తుల సౌలభ్యాన్ని, దేవస్థానం ఆర్థిక ప్రయోజనాలను, లావాదేవీల్లో పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని.. సింహాచలం
దేవస్థానంలో కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం సింహాచలంలో దర్శనం టికెట్లు, వివిధ ఆర్జిత సేవల టికెట్లు, ప్రసాదాల కొనుగోలు, కేశఖండన వంటి అన్ని సేవలకు నగదు చెల్లింపు తప్పనిసరి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సింహగిరికి భక్తులు తరలివస్తుంటారు. అయితే సరిపడా నగదు వెంట తెచ్చుకోలేనివారి భక్తుల బాధలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు అధికంగా వినియోగించే యువత.. సరిపడా నగదు వెంట తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో స్మార్ట్ఫోన్, బ్యాంకు ఖాతాలో నగదు ఉన్నప్పటికీ.. ఆలయ కౌంటర్ల వద్ద ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపుల సౌకర్యం లేకపోవడంతో గంటల తరబడి క్యూలో నిరీక్షించి.. చివరకు నిరాశకు గురవుతున్నారు. కొండ దిగువన బస్సు టికెట్టు నుంచి కొండపైన ప్రతి అవసరానికీ నగదు కోసం ఇతరులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వస్తే.. ఈ సమస్యలన్నీ తీరుతాయని భక్తులు అంటున్నారు.
దేవస్థానానికి ఆదాయ మార్గం
డిజిటల్ పేమెంట్లు అందుబాటులో లేకపోవడంతో దేవస్థానం కొంత ఆదాయం నష్టపోతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిత్యాన్నదాన పథకానికి విరాళాలు అందించాలనుకునే భక్తులు అనేకమంది ఉంటారు. ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం నగదు, చెక్కు, డీడీ రూపంలో విరాళాలు స్వీకరిస్తున్నారు. స్వామికి విరాళం ఇవ్వాలని వారు ముందుగా నిర్ణయించుకుని సింహగిరికి వస్తారు. పై మూడు పద్ధతుల్లో ఏదొకదాన్ని అనుసరించి విరాళం అందజేస్తుంటారు. కాగా.. ఆలయానికి వచ్చిన తర్వాత, స్వామి వారి దర్శనానంతరం లేదా అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత తక్షణమే తమకు తోచినంత విరాళం ఇవ్వాలని చాలా మంది భక్తులు భావిస్తుంటారు. అయితే చేతిలో తగినంత నగదు లేకపోవడం, డిజిటల్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో వీరు విరాళం ఇవ్వలేక వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం అన్నప్రసాద విభాగం కౌంటర్ వద్ద రోజూ పదుల సంఖ్యలో భక్తులు డిజిటల్ చెల్లింపుల గురించి ఆరా తీస్తున్నారు. డిజిటల్ చెల్లింపులతో చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు విరాళాలు సులభంగా స్వీకరించే వీలుంటుంది, తద్వారా అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అంతేకాకుండా దర్శనం టికెట్లు, ఇతర సేవల ద్వారా కూడా దేవస్థానానికి పారదర్శకంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
అప్పన్న సన్నిధిలో అన్నీ నగదు లావాదేవీలే..
డిజిటల్ పేమెంట్లు లేక భక్తుల అవస్థలు
విరాళాల సమర్పణలోనగదు రహిత చెల్లింపులతో మేలు
తద్వారా భక్తులకు సౌలభ్యం, దేవస్థానానికి ఆదాయం
డిజిటల్ భాగ్యం కలిగేనా?
డిజిటల్ భాగ్యం కలిగేనా?
డిజిటల్ భాగ్యం కలిగేనా?
డిజిటల్ భాగ్యం కలిగేనా?
డిజిటల్ భాగ్యం కలిగేనా?