బొగ్గు లారీ బీభత్సం | - | Sakshi
Sakshi News home page

బొగ్గు లారీ బీభత్సం

Jun 4 2025 2:17 AM | Updated on Jun 4 2025 2:17 AM

బొగ్గ

బొగ్గు లారీ బీభత్సం

నలుగురికి గాయాలు

పరవాడ: అనకాపల్లి–విశాఖ జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో మంగళవారం ఉదయం ఓ బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. విశాఖ పోర్టు ట్రస్టు నుంచి అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌కు వెళ్తున్న బొగ్గు లారీ ఉద యం 6.45 గంటల సమయంలో అతివేగంగా వచ్చి ముందున్న కారును, ఆటో ను ఢీకొట్టింది. అనంతరం సిగ్న ల్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. ప్ర మాదంలో కారు వెనుక భాగం దె బ్బతినగా, ఆటో ముందు భాగం నుజ్జయింది. ఆటోలో ఉన్న సీతారాములు, నాగలక్ష్మి, ఆదిలక్ష్మి, దేముడమ్మ గాయపడ్డారు. క్షతగాత్రులను అగనంపూడి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ఆదిలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో సిగ్నల్‌ విద్యుత్‌ స్తంభం, హైమాక్స్‌ లైట్‌, రెయిలింగ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉదయం సమయంలో రోడ్డుపై పెద్దగా జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పరవాడ సీఐ ఆర్‌.మల్లికార్జునరావు, ఎస్‌ఐ కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బొగ్గు లారీని క్రేన్‌ సహాయంతో బయటకు తీసి.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లికార్జున రావు తెలిపారు.

బొగ్గు లారీ బీభత్సం 1
1/2

బొగ్గు లారీ బీభత్సం

బొగ్గు లారీ బీభత్సం 2
2/2

బొగ్గు లారీ బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement