
కమాండెంట్ మురళీకృష్ణకు ఘనంగా వీడ్కోలు
పీఎంపాలెం: ఏపీఎస్పీ 16వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న కేవీ మురళీకృష్ణ తిరుమల దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం బక్కన్నపాలెం బెటాలియన్ ఆవరణలో ఆయన వీడ్కోలు సభ జరిగింది. స్థానిక అధికారులు, సిబ్బంది కమాండెంట్ మురళీకృష్ణ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ టీటీడీ సీవీఎస్వోగా బదిలీ కావడం, శ్రీవారి సన్నిధిలో సేవ చేసే అవకాశం లభించడం మహాభాగ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇన్చార్జి కమాండెంట్గా బాధ్యతలు చేపట్టిన శ్రీకాకుళం 1వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ సీహెచ్వీఎస్ పద్మనాభరాజు మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం మురళీకృష్ణ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. కేజీహెచ్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శిల్పా మురళీకృష్ణ, ఇన్చార్జి అదనపు కమాండెంట్ పి.సత్యం, సహాయ కమాండెంట్లు ఎన్.మురళీధర్, వి.నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.