
‘పాలగెడ్డ’లో జారి యువకుడి మృతి
మృతుడు అక్కయ్యపాలెం వాసి
మాడుగుల రూరల్: మాడుగులలో జరుగుతున్న మోదమాంబ జాతరకు విశాఖపట్నం నుంచి వచ్చిన యువకుడు పాలగెడ్డ జలాశయంలో కాలుజారి పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి. అక్కయ్యపాలెం గణేష్నగర్ కాలనీకి చెందిన కె.రోషన్, జయశంకర్, గణేశ్, ఎన్.నవీన్ కలిసి మంగళవారం ఉదయం మాడుగుల సమీపంలోని పాలగెడ్డ జలాశయంలో దిగారు. వీరిలో రోషన్ కాలుజారి జలాశయంలో పడిపోయాడు. రోషన్కు ఈత రాకపోవడంతో జలాశయంలో పడి మృతి చెందాడు. యువకుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రోషన్ మృతితో మిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జాతర రోజున ఇటువంటి సంఘటన జరగడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.