
నాస్కామ్ ఉచిత ఇంటర్న్షిప్నకు దరఖాస్తులు
మద్దిలపాలెం: నాస్కామ్ ఉచిత ఇంటర్న్షిప్ ప్రొగ్రా మ్లో భాగంగా ఏయూ పరిధిలో 50 వేల మంది ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు ప్రొగ్రామ్ పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించి, మాట్లాడారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఏపీ ఉన్నత విద్యా మండలి, ఏయూ సంయుక్తంగా నాస్కామ్ సహకారంతో విద్యార్థులకు ఈ ఉచిత స్వల్పకాలిక ఇంటర్న్షిప్ను అందిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఈ నెల 7లోగా ఉన్నత విద్యా మండలి పోర్టల్లో విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 90526 56967లో సంప్రదించాల్సిందిగా సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య ధనుంజయరావు, నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ రీజినల్ హెడ్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.