
ముగిసిన బ్యాడ్మింటన్ టోర్నీ
ఎంవీపీకాలనీ: ఎంవీపీకాలనీలోని ఎస్–3 స్పోర్ట్స్ ఏరీనా వేదికగా జరుగుతున్న హండ్రెడ్ ఎస్3 ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 400 మంది క్రీడాకారులు అండర్ 11, 13, 15, 17 ఏళ్ల కేటగిరీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఇండియన్ ఆయిల్ సీనియర్ మేనేజర్ చైతన్య, శ్రీనివాస్, కార్పొరేటర్ ఉషశ్రీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వి.వి.సోమరాజును సత్కరించారు. స్పోర్ట్స్ ఏరీనా నిర్వాహకుడు సహాని తదితరులు పాల్గొన్నారు.