
ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి సీపీ సన్మానం
విశాఖ సిటీ: విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఏడుగురు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి గురువారం సన్మానించారు. హోంగార్డు కమాండెంట్ కె.వి.ప్రేమ్జిత్, ఎస్ఐ ఐ.నాగరాజు, ఏఆర్ఎస్ఐ కె.అప్పారావు, ఏఎస్ఐ కె.వి.ఎస్.ఎన్.మూర్తి, ఏఎస్ఐ వై.ఈశ్వరరావు, హెచ్సీ టి.రాము, హోంగార్డు పి.శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ పొందారు. దీంతో వీరిని కుటుంబ సభ్యులతో కలిపి గురువారం పోలీస్ సమావేశ మందిరానికి ఆహ్వానించారు. పోలీస్ అధికారుల సమక్షంలో వారిని సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపి వీడ్కోలు పలికారు.