
ఆక్సిజన్ టవర్స్లోఅగ్ని ప్రమాదం
సీతమ్మధార: సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ లో బుధవారం రాత్రి 11.40 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. 30వ అంతస్తులోని 3003వ ఫ్లాట్లో బాలుడు బాణసంచా కాల్చడంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు.. అవి విద్యుత్ తీగలను తాకి, బెడ్ రూమ్లోని ఏసీ వద్ద షార్ట్ సర్క్యూట్కు కారణమయ్యాయి. దీంతో మంటలు బెడ్రూమ్ నుంచి వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనతో టవర్స్లో నివసిస్తున్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యా రు. సమీపంలోని తోపుడుబండి వ్యాపారులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రీజినల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి తన సిబ్బందితో టవర్స్కు చేరుకుని.. చాకచక్యంగా మంటలను అదుపుచేశారు. ఎంవీపీ సీఐ జె.మురళీ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంలో సోఫా, టీవీ, దుస్తులు దగ్ధమయ్యా యి. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అ యితే ఇంట్లో బాలుడు ఒక్కటే ఉన్నట్లు సమా చారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.