
వర్షం తెచ్చిన తంటా
ధారూరు: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించుకుపోతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గురువారం మధ్యాహ్నం వరకు జాడలేని వాన సాయంత్రం కాగానే చినుకుతో ప్రారంభమై విజృంభించింది. మండల పరిధిలో ఆరుబయట, కల్లాల్లో ఆరబెడుతున్న వడ్లు తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నా తేమ ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయడానికి నాగసమందర్ కేంద్రంలో నిర్వాహకులు మొండికేస్తున్నారు. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని రైతులు ఆరోపించారు. ఇప్పటికై నా ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల దిగాలు

వర్షం తెచ్చిన తంటా