
రంగాపూర్లో డీపీఎం విచారణ
పరిగి: మండల పరిధిలోని రంగాపూర్లో మహిళా సంఘాల నుంచి విలేజ్ బుక్ కీపర్ డబ్బులు వసూలు చేస్తున్నారని సభ్యులు ఆందోళన చేయడంతో గురువారం డీపీఎం నర్సింహులు విచారణ చేపట్టారు. గ్రామంలోని 10 మహిళా సంఘాల సభ్యులతో వివరాలను సేకరించారు. అనంతరం డీపీఎం మాట్లాడుతూ.. మహిళా సంఘాల ద్వారా విచారణ చేపట్టగా బుక్ కీపర్ ఎలాంటి డబ్బులు వసూలు చేసినట్టు తేలలేదన్నారు. ఒకరు తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని, తన సంతకం లేకుండానే బ్యాంకులో రుణం తీసుకున్నారని చెప్పడంతో ఆ మహిళా సంఘ సభ్యురాలు గ్రూపు డిఫాల్ట్లో ఉన్నట్టు తేలింది. గ్రామంలోని కొంత మందికి వ్యక్తిగత కారణాల వల్ల ఇలా జరిగిందని, తమ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు గ్రూపు సభ్యులు ఎవరూ చెప్పలేరన్నారు. కార్యక్రమంలో గ్రామ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.