
విద్యుదాఘాతంతో మహిళ మృతి
మోతీనగర్: భవన నిర్మాణ పని చేస్తున్న మహిళ విద్యుత్ షాక్తో మృతి చెందిన సంఘటన అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సఫ్దార్నగర్లో నిర్మాణంలో ఉన్న భవనంలో గుంపు అనసూయ (45) అనే మహిళ కూలీ పని చేస్తోంది. బుధవారం ఆమె మెటీరియల్ లిఫ్ట్ వద్ద పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయింది. తోటి కూలీలు ఆమెను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. యజమాని నిర్ల క్ష్యం కారణంగానే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.