ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

May 29 2025 10:04 AM | Updated on May 29 2025 10:04 AM

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

ధారూరు: మండల పరిధిలోని నాగసమందర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సివిల్‌ సప్లై డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తడిస్తే కొనమంటూ నిర్వాహకులు పేర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. 40 కిలోల బస్తాకు రెండున్నర కిలోల వడ్లు అదనంగా ఇస్తేనే రైస్‌మిల్లు యజమాని తీసుకుంటారని వెలుగు సీసీ యాదయ్య సూచించండంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. సివిల్‌ సప్లై డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ కలుగజేసుకొని విషయాన్ని సద్దుమణిగించారు. అనంతరం తడిసిన ధాన్యాన్ని రైతులతో కలిసి ఆయన పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement