దళిత రైతుపై దౌర్జన్యం సరికాదు | - | Sakshi
Sakshi News home page

దళిత రైతుపై దౌర్జన్యం సరికాదు

May 29 2025 10:04 AM | Updated on May 29 2025 10:04 AM

దళిత రైతుపై దౌర్జన్యం సరికాదు

దళిత రైతుపై దౌర్జన్యం సరికాదు

బొంరాస్‌పేట: మండల పరిధిలోని బాపన్‌చెరువుతండాకు వేసిన బీటీ రోడ్డు నిర్మాణంలో రేగడిమైలారానికి చెందిన దళిత రైతు కడంపల్లి బాలయ్యపై కాంట్రాక్టర్‌ హన్మంత్‌రెడ్డి దాడి చేయించడాన్ని ప్రజాసంఘాల నేతలు తప్పుబట్టారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ జిల్లా కమిటీ సభ్యుడు దస్తయ్య ఆధ్వర్యంలో క్షేత్ర పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలయ్యకు చెందిన 10 గుంటల పట్టా భూమి రోడ్డు నిర్మాణంలో కోల్పోవడంతో రూ.15 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిపారు. దీనిపై రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్‌పై అట్రాసిటి కేసు నమోదు చేయాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సంఘాల పక్షాన ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య, అంబేడ్కర్‌ ప్రజాసంఘాల తాలుకా అధ్యక్షుడు రమేష్‌బాబు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సంఘం నాయకుడు కొత్తురు చంద్రయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, బాలరాజు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement