ఏఐ రంగంలో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

ఏఐ రంగంలో రాణించాలి

Jun 3 2025 10:30 AM | Updated on Jun 3 2025 2:13 PM

ఏఐ రం

ఏఐ రంగంలో రాణించాలి

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తిరుపతికి చెందిన ఎం.భానుచరణ్‌రెడ్డి జాతీయ స్థాయి ఓపెన్‌ కేటగిరిలో 51వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరిలో 4వ ర్యాంకు సాధించాడు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఎం.జయభారత్‌రెడ్డి, ఎం.సురేఖ దంపతుల కుమారుడైన భానుచరణ్‌రెడ్డి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) రంగంలో రాణించడమే తన లాంగ్‌ టర్మ్‌ గోల్‌ అని తెలిపాడు. ప్రస్తుతం ఐఐటీ బాంబేలో సీటు పొంది సీఎస్‌ఈ చదవడమే తన లక్ష్యమని తెలిపాడు.

– ఎం.భానుచరణ్‌రెడ్డి, తిరుపతి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో ప్రతిభ

చిల్లకూరు: గూడూరు పట్టణంలోని ఐసీఎస్‌ రోడ్డుకు చెందిన వేగూరు నితన్‌రెడ్డి జాతీయ స్థాయిలో 535వ ర్యాంకు సాధించాడు. నితిన్‌ రెడ్డి తండ్రి రవీంద్రరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి సుచిత్ర సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌. నితిన్‌రెడ్డి హైదరాబాద్‌లో చదువుకుంటూ అక్కడే కోచింగ్‌ తీసుకుని జాతీయ స్థాయిలో రాణించాడు.

ఏఐ రంగంలో రాణించాలి 
1
1/1

ఏఐ రంగంలో రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement