బైక్‌ అదుపు తప్పి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపు తప్పి యువకుడి మృతి

Jun 3 2025 10:30 AM | Updated on Jun 3 2025 2:13 PM

బైక్‌ అదుపు తప్పి యువకుడి మృతి

బైక్‌ అదుపు తప్పి యువకుడి మృతి

ఏర్పేడు: మండలంలోని వికృతమాల టీసీఎల్‌ కంపెనీ సమీపంలో విధులు ముగించుకుని వెళుతూ బైక్‌ నుంచి అదుపు తప్పి కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాలు.. బాపట్ల జిల్లా, ఇంకోలుకు చెందిన మహబూబ్‌ జానీ కుమారుడు కాలేషా(25) మూడు నెలల కిందట వికృతమాల సమీపంలోని టీసీఎల్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా చేరాడు. స్థానికంగానే ఉంటూ ఇక్కడే పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై బయల్దేరాడు. కొంత దూరంలోనే స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బైక్‌ అదుపు తప్పడంతో కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో కాలేషా తలకు బలమైన రక్తగాయమైంది. క్షతగాత్రుని 108 వాహనంలో చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతదేహానికి తిరుపతి ఎస్‌వీ వైద్యకళాశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement