● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమతులు ● చెరువు, కలుజుకు అడ్డుగా ప్రహరీ గోడ నిర్మాణం ● దగ్గరుండి పనులు చేయిస్తున్న ఇరిగేషన్‌ అధికారులు | - | Sakshi
Sakshi News home page

● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమతులు ● చెరువు, కలుజుకు అడ్డుగా ప్రహరీ గోడ నిర్మాణం ● దగ్గరుండి పనులు చేయిస్తున్న ఇరిగేషన్‌ అధికారులు

Jun 3 2025 10:30 AM | Updated on Jun 3 2025 2:14 PM

● రియ

● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమ

రేణిగుంట: ఇరిగేషన్‌ అధికారులు రియల్టర్లకు దాసోహమైపోయారు. చెరువు, కలుజులకు అడ్డుగా పనులు చేస్తున్నా తామే అనుమతించామంటూ చెప్పుకొస్తున్నారు. కానీ భారీ వర్షాలు వస్తే మాత్రం ముప్పుతప్పదని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ.. ఆ కథ ఏందో మీరే చదవండి..

రేణిగుంట మండలం, జిపాళ్యం పంచాయతీలోని కుర్రకాలువ గ్రామ లెక్క దాఖల సర్వే నంబర్‌ 18/1లో 4.21 ఎకరాల మేర సాగుకు పనికిరాని ప్రభుత్వ భూమి (డ్రైల్యాండ్‌) చెరువు కింద ఉంది. ఇక్కడ చెరువు నుంచి అధనపు నీళ్లు వెళ్లేందుకు కలుజు ఏర్పాటు చేశారు. కలుజు నుంచి వచ్చే నీళ్లు భూమి మధ్యలోని కాలువ ద్వారా పద్మానగర్‌ మీదుగా ఏర్పేడు మండలం, వికృతమాల చెరువుకు చేరుతాయి.

వాటిని చేతిలో పెట్టుకుని..

గతంలో పక్కనే ఉన్న డీకేటీ భూమికి చెందిన పత్రాలు పెట్టుకొని ఫ్రీ హోల్డ్‌లో రెవెన్యూ అధికారుల ద్వారా కొందరు రియల్టర్లు అనుమతులు పొందారు. ఇదే అదునుగా కలుజు భూమి పై కన్నుపడింది. అధికార పార్టీ నియోజకవర్గ నేత అండదండలతో ఇరిగేషన్‌ అధికారుల నుంచి కలుజు కాలువకు పైపులు వేసేందుకు అనుమతులు తీసుకున్నారు. సుమారు 30 అడుగుల వెడల్పుతో ఉన్న కలుజుకు మధ్యలో రెండు పైపులను వేసి మట్టి తొలి పూడ్చివేశారు. కలుజు కింద భూమిలో లేఅవుట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

చర్యలేవి

తిరుపతి–పాపానాయుడుపేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూమి కావడంతో రియల్టర్లు కన్ను పడింది. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు అటువైపు వెళ్లేందుకు సాహసించడం లేదు. కాలువ పోరంబోకులో పేదలు చిన్న ఇల్లు నిర్మించుకుంటేనే కూలదోసే.. రెవెన్యూ అధికారులు ఇంత జరుగుతా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

వర్షమొస్తే ముప్పే

99 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు ఉండేది ఒకటే కలుజు. చెరువు నిండిన తర్వాత అధనపు నీళ్లు వెళ్లే కలుజు కింద 10 అడుగుల దూరంలో ప్రహరీ గోడ అడ్డుగా నిర్మించారు. గతంలో భారీ వర్షాలు పడినప్పుడు చెరువు నీళ్లు కలుజు గుండా వెళ్లేవి. పద్మానగర్‌లోని సగం ఇళ్లు మునకకు గురయ్యేవి. ఇంతటి నీటి ప్రవాహం వచ్చే ప్రదేశంలో లే అవుట్‌ వేసి అమాయకులకు ప్లాట్లు అమ్మే ఏర్పాట్లు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. భారీ వర్షాలొస్తే ఇబ్బందులు తప్పవని స్థానికులు చెబుతున్నారు.

అనుమతులతోనే పనులు

మా నుంచి అన్ని అనుమతులు తీసుకున్నారు.కలుజు నుంచి వచ్చే నీళ్లను అంచనా వేసి, మేము డిజైన్‌ చేసిన విధంగానే రియల్టర్లు పనులు చేస్తున్నారు. పైపులు పైన ఎటువంటి నిర్మాణాలు చేపట్టరు. ముందు కాలువ ద్వారా నీళ్లు పోయేవి, ఇప్పుడు పైపుల ద్వారా నీళ్లు వెళతాయి. ఎంత వాన వచ్చిన ఎటువంటి ఇబ్బందీ ఉండవు.

– ప్రకాష్‌రావు, ఇరిగేషన్‌, డీఈ, శ్రీకాళహస్తి

మేమే అనుమతిచ్చాం

సోమవారం ఉదయం కలుజు ప్రహరి గోడ మధ్య ట్యాంకు నిర్మించేందుకు జేసీబీతో పెద్ద గుంతను తవ్వారు. ఇరిగేషన్‌ డీఈ ప్రకాష్‌రావు చెరువు వద్దకు చేరుకొని పరిశీలించి తమ అనుమతులతోనే చేస్తున్నారని చెప్పారు. పైపుల పైన ఎటువంటి నిర్మాణం జరపరని తెలిపారు. కానీ కలుజుకు అడ్డుగా పైపుల పైన ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేశారు. అది రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు మాత్రం కనబడకపోవడం గమనార్హం.

● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమ1
1/4

● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమ

● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమ2
2/4

● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమ

● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమ3
3/4

● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమ

● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమ4
4/4

● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement