
వంచించడం..బాబు నైజం!
● వెన్నుపోటు దినం రేపు ● కూటమి మోసాలను ఎండగడదాం ● వైఎస్ఆర్సీపీ జిల్లా పార్లమెంటు పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి
శ్రీకాళహస్తి: రేపు జరగబోయే వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని తిరుపతి జల్లా పార్లమెంట్ పరిశీలకుడు మేడ రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ ఆత్మీయ సమావేశం సోమవారం పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ రఘునాథరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ‘వెన్నుపోటు’ పొడిచిన టీడీపీ ప్రభుత్వ మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నట్టు తెలిపారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, జిల్లా కలెక్టరేట్ వద్ద ‘నిరసన కార్యక్రమాలు’ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బియ్యపు మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని కుట్రలు, కుతంత్రాలు భయానక వాతావరణాన్ని సష్టించాలని చూస్తున్నారన్నారు. అలాగే జూన్ 4న జరిగే వెన్నుపోటు దినాన్ని విజయవంత చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, బర్రె సుదర్శన్ రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, ఇన్చార్జ్ కిషోర్ రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షుడు గంగారి రమేష్, రేణిగుంట ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, తొట్టంబేడు మండల అధ్యక్షుడు కోగిల సుబ్రమణ్యం, కోవి చంద్రయ్య నాయుడు, ఢిల్లీ బాబు, జనార్ధన్యాదవ్, నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీది, గోరా, అస్లాం, బాబు, గఫుర్, సాగిరబీ తదితరులు పాల్గొన్నారు.