
పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్, ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపైన్ బ్యానర్స్, పోస్టర్స్, పాంప్లెట్స్ను సోమవారం కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని సంస్థలను సమన్వయం చేసుకుని టీబీ నిర్మూలనకు ప్రజలను చైతన్య వంతులను చేయాలన్నారు. జేసీ శుభం బన్సల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా కుష్టు, క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తి పాల్గొన్నారు.